Tuesday, 14 April 2026 11:22:08 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

కేంద్ర బడ్జెట్, దరులు పెరిగేవి,తగ్గేవి ఒక సారి చూసిద్దాము......

Date : 02 February 2023 11:00 AM Views : 952

విశ్వాస్ టీవీ - ఢిల్లీ / విజయవాడ : ‘బడ్జెట్‘ దీని గురుంచి వార్తలు రాసేవారికి, వ్యాపారస్తులకు తప్ప మిగిలిన ప్రజానీకానికి అనవసరం. ప్రయోజనాలు ఉన్నా అర్థం కాని పరిభాషలో ఉంటుంది కనుక అనవసరం అన్నట్లుగా భావిస్తారు. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కోటి ఆశలతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ‘కేంద్ర బడ్జెట్ 2023-24‘ను ప్రవేశపెట్టారు. ఇందులో వేతన జీవులకు వరాలు(ఏడు లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు), మహిళల కోసం ప్రత్యేక పథకం(మహిళా సమ్మాన్ పొదుపు పథకం), పాన్ కార్డుకు జాతీయ కార్డుగా గుర్తింపు, రైల్వేల అభివృద్ధికి రూ.2.4 లక్షల కోట్లు, విద్యారంగానికి అధిక ప్రాధాన్యత కల్పించడం.. వంటి హైలైట్స్ ఉన్నాయి.అలాగే, కొన్ని దిగుమతి తీసుకునే వస్తువుల సుంకాలపై రాయితీ కల్పించగా, మరికొన్నింటిపై పన్ను భారం వేశారు. పలితంగా కొన్ని వస్తువులు ధరలు తగ్గనుండగా… మరికొన్ని వస్తువులు ఖరీదైనవిగా మారనున్నాయి. బడ్జెట్ -2023 కారణంగా ఏయే వస్తువుల ధరలు తగ్గనున్నాయి..? ఏయే వస్తువుల ధరలు పెరగనున్నాయి..? అన్నది ఓసారి తెలుసుకోండి..

ధరలు పెరిగే వస్తువులు ::::::సిగరెట్‌పై పన్నును 16 శాతానికి పెంచారు. దీంతో సిగరెట్‌ ధర మరింత పెరగనుంది.... బంగారం, వెండి, ప్లాటినం వస్తువులపై పన్ను పెరుగనుంది. దీని వల్ల వీటి ధరలు మరింత ప్రియం కానున్నాయి. దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్‌ చిమ్నీలపై పన్నును 7.5 నుంచి 15 శాతానికి పెంచారు. దీంతో వీటి రేట్లు పెరగనున్నాయి...... రబ్బర్‌ పై కస్టమ్స్ సుంకాన్ని పెంచారు. పలితంగా రబ్బర్ తో తయారుచేసే టైర్లు, చెప్పులు వంటి వాటి ధరలు పెరగనున్నాయి..................... బ్రాండెడ్‌ వస్తువులు ధరలు కూడా మరింత ప్రియం కానున్నాయి.

..ధరలు తగ్గించే వస్తువులు..... ఎలక్ట్రిక్‌ వాహనాల రంగాలకు మరింత ఉత్తేజాన్నిచ్చారు. దీంతో ఎలక్ట్రిక్‌ కార్లు, బైకుల ధరలు తగ్గనున్నాయి............... కెమెరా లెన్స్, లిథియం ఆయన్ బ్యాటరీ వంటి మొబైల్ ఫోన్లు, కెమెరాలలో ఉపయోగించే ఉపకరణాలపై కస్టమ్ సుంకాన్ని తగ్గించారు. ఫలితంగా వీటి ధరలు తగ్గనున్నాయి......... టెలివిజన్‌ ప్యానల్‌లో బిగించే సెల్‌లో ఉండే కొన్ని భాగాలపై కస్టమ్స్‌ సుంకాన్ని 5శాతం నుండి 2.5శాతానికి తగ్గించారు. దీంతో వీటి ధరలు తగ్గే అవకాశం ఉంది.... ల్యాబ్‌లలో తయారు చేసే.. అంటే కృత్రిమంగా తయారుచేసే డైమండ్లపై కస్టమ్ సుంకం తక్కువగా ఉంటుంది. దీంతో వీటి ధరలు తగ్గనున్నాయి........ క్రూడ్ గ్లిజరిన్‌పై ఉండే పన్నును 7.5 నుంచి 2.5కు తగ్గించారు. అలాగే, డీనేచర్డ్ ఇథైల్ ఆల్కహాల్‌కు పన్ను నుంచి విముక్తి కల్పించారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :