Saturday, 13 June 2026 07:54:33 PM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

ఓ హాస్పిటల్ లో, దారుణo చోటు చేసుకుంది... కింద తల్లి,పక్కన అమ్మాయి శవం....

Date : 30 May 2023 09:23 AM Views : 1027

విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : విశ్వాస్ టీవీ న్యూస్ ::గుజరాత్ రాష్ట్రంలోని ఓ ఆస్పత్రిలో దారుణ సంఘటన జరిగింది. ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్ లోని అల్మారాలో 30 ఏళ్ల మహిళ మృతదేహం లభ్యం కాగా, అదే ఆస్పత్రిలోని ఓ మంచం కింద ఆమె తల్లి మృతదేహం కూడా లభ్యమైంది. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన తల్లీకూతుళ్లు శవాలుగా మారడం సంచలనం సృష్టిస్తోంది. అహ్మదాబాద్ లోని కాగ్డాపీట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఆసుపత్రి నుంచి తీవ్రంగా దుర్వాసన వస్తుండటంతో ఆ వాసన ఎక్కడ నుంచి వస్తుందా.. అని ఆస్పత్రి సిబ్బంది వెతకడం ప్రారంభించారు. వారికి ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్ లోని అల్మారాలో 30 ఏళ్ల మహిళ మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో కనిపించింది. దీంతో వారు వెంటనే కాగ్డాపీట్ పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని ఆస్పత్రి మొత్తం పరిశీలించారు. ఆస్పత్రికి చనిపోయిన మహిళతో పాటు ఆమె తల్లి కూడా వెంట వచ్చిందని తెలుసుకొని ఆమె ఆచూకీ కోసం వెతికారు. వారికి ఆస్పత్రిలోని ఓ మంచం కింద వృద్ధురాలి మృతదేహం కూడా లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిద్దరి మృతికి కారణంగా అనుమానిస్తూ ఆస్పత్రిలో పనిచేసే మన్ సుఖ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన తల్లి కూతుళ్లను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది..? కూతురిపై అఘాయిత్యానికి ప్రయత్నించగా.. తల్లి అడ్డుకుందా..? అందుకే వారిద్దరిని చంపారా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు వివిధ కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :