విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం: 10 మంది పోలీసుల మృతి దంతేవాడ: ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. దంతేవాడలో పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందుపాతర పేలుడు జరిపారు.. ఈ ఘటనలో 10 మంది పోలీసులు, డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. దంతేవాడ అడవుల్లో మావోయిస్టులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో ఈ ఉదయం పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఆ ఆపరేషన్ ముగించుకుని తిరిగి వస్తుండగా నక్సల్స్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు..
Admin
Viswas Tv