విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విజయనగరం జిల్లా : *గురజాడ గృహాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం.భీశెట్టి బాబ్జి.లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు సాహిత్య రంగంలో తెలుగుజాతిని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టిన మహాకవి గురజాడ అప్పారావు నివసించిన గృహం అద్వాన్నంగా ఉంటే పట్టించుకొనే తీరిక ప్రభుత్వానికి,ఎమ్మెల్యేలకి,మంత్రులకి లేని పరిస్థితి నెలకొందని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆరోపించారు శనివారం ఉదయం గురజాడ గృహాన్ని సాహిత్య అభిమానులతో కలసి సందర్శించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఈ నెల సెప్టెంబర్ 21 న గురజాడ 161 వ జయంతి ని జరుపుకుంటామని ఆరోజుకి గోడలకి రంగులు వేసి,పూలదండ లతో అలంకరించి గురజాడ ని ఆహా,ఓహో అని చెప్పి,అధికారులు, నాయకులు వెంటనే మరచిపోతారని ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న తంతుగానే మిగిలిపోతుందని భీశెట్టి ఆవేదన వ్యక్తంచేశారు, గురజాడ ఇంటి చుట్టూ దుర్గంధం పూరితమై వాతావరణం నెలకొందని,తలుపులు, కిటికీలు,విరిగిపడివున్నాయని,తెలుగు జాతి చైతన్య స్ఫూర్తి,మహాకవి,దేశమంటే మట్టికాదోయ్,దేశమంటే మనుసులోయ్,అని చెప్పిన మహా మనిషి గురజాడ అప్పారావు గృహంకి ఈ పరిస్థితి రావడం ఆయన అభిమాని గా తట్టుకోలేకపోతున్నానని,ఎవరు అధికారంలోకి వచ్చినా ఇంటిని ఆధునీకరణ చెయ్యడం లేదని,కన్యాశుల్కం నాటకంలో మనవాళ్లు వట్టి వెదవాయులోయ్ అనే మాట గురజాడ ఎందుకన్నారో ఇప్పుడు అర్ధం అవుతుందని ఎద్దేవా చేసారు, పాలకులు వెంటనే గురజాడ ఇంటిని అదునీకరించాలని డిమాండ్ చేస్తూ ఇంటి పరిసరాల ఫోటోలు విడుదల చేశారు, ఈ సమావేశంలో ప్రముఖ సాహిత్య వేత్త డాక్టర్ జక్కు రామకృష్ణ, సత్యప్రసాద్,తేజ,కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Viswas Tv