విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : *ఇన్చార్జులకు టికెట్ విషయంలో మొండిచేయి*:- *ఇన్చార్జి PVG కుమార్* ఈరోజు మాడుగుల నియోజవర్గం కె కోటపాడు మండల కేంద్రంలో *మాడుగుల నియోజవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పివిజి కుమార్* గారు విలేకరుల సమావేశంలో ఇంచార్జ్ PVG కుమార్ గారు మాట్లాడుతు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు రెండున్నర సంవత్సరాల క్రితం ఈ మాడుగుల నియోజకవర్గానికి నన్ను ఇన్చార్జి గా ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుండి నియోజవర్గంలోని 24*7 నియోజవర్గ ప్రజల్లోనే ఉంటూ వాళ్లతో మమేకమై తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రోగ్రామ్స్ కమిటీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం జరిగింది అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు గౌరవసభ, బాదుడే బాదుడు, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి, ఒంగోలు లో జరిగిన మహానాడు, చోడవరంలో జరిగిన మినీ మహానాడు, రాజమండ్రిలో జరిగిన మహానాడు, భోగాపురంలో జరిగిన యువగలం నవశకం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో ఉంచిన సమయంలో 53 రోజులు దీక్ష చేయడం జరిగింది ఆ దీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా మాడుగుల నియోజకవర్గానికి 4 వ ర్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. మాడుగుల నియోజవర్గం గొండుపాలెం లో జరిగిన రా..కదిలిరా, మాడుగుల లో జరిగిన శంఖారావం ఇలా పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ వచ్చా అన్నారు. కానీ ఎవరైతే కష్టపడితే వాళ్లకి టికెట్ ఇస్తానని చెప్పి, ఇన్చార్జిలకే టికెట్లని చెప్పి ఈరోజు ఏ నివేదికలు మార్పులు జరిగాయో తెలియదు గానీ, ఏ విధంగా మార్పింగ్ జరిగిందో, తెలియదు గాని, కష్టపడిన వాళ్లకి టికెట్లు దక్కలేదు అని చెప్పి అన్నారు. ఇంకా బీఫామ్ ఇచ్చేంతవరకు సమయం ఉంది కాబట్టి ఈరోజు ప్రకటించిన ఈ మాడుగుల నియోజకవర్గం టికెట్ పై శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించి నిరంతరం ప్రజల్లో ఉండి ఇన్చార్జ్ ఇచ్చిన దగ్గర నుండి కష్టపడి పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన వాళ్లకే బీఫామ్ ఇస్తారని అపారమైన నమ్మకం నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని ఇంచార్జ్ పివిజి కుమార్ గారు అన్నారు. ఈరోజు నిజం ఓడింది అబద్ధం గెలిచింది అని చెప్పి అన్నారు. కానీ నిజం గెలవాలి అబద్ధం వాడాలి అని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేడుకున్నారు.
అబద్దాలు కి, మోసాలుకి, మారు పేరు పైలా ప్రసాద్ రావు ఆలాoటి వారికీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం టీడీపీ పతనానికి నాoది, మాడుగుల నుండి మొదలయింది అని నిజ మైన టీడీపీ శ్రేణులు అన్నారు
Admin
Viswas Tv