విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : తెలుగు రాష్ట్రాల్లో హోరా హోరీ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సర్వేకు సంబంధించి ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చాయి. గత ఎన్నికల్లో ఏపీలో టీడీపీ 3, వైసీపీ 22 స్థానాలు గెలుచుకోగా.. ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఆసక్తి కర పోరు కొనసాగనుంది. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందా.. పొత్తుతో ముందుకు వెళ్తుందా అనే దానికి అనుగుణంగా సీట్ల సంఖ్య మారే అవకాశం ఉంది. తెలంగాణలో ట బిఆర్ఎస్ మెజార్టీ సీట్లు సాధించే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తం అయ్యాయి. బీజేపీ గతంలో నాలుగు సీట్లు పొందగా.. ఇప్పుడు కొంత మేర పుంజుకున్నట్లు స్పష్టం అవుతోంది. జాతీయ స్థాయిలో బీజేపీకి ఆదరణ పెరగ్గా..తెలంగాణలోనూ ఆ ప్రభావం కొంత మేర కనిపిస్తోంది. కానీ, ఏపీలో మాత్రం ప్రాంతీయ పార్టీల వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
Admin
Viswas Tv