విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / అనకాపల్లి జిల్లా : అచ్యుతాపురం ఎస్.కె.ఆర్ లాడ్జ్ లో యువతి మృతి, కొన ఊపిరితో యువకుడు పరస్పరం దాడిలో మృతి చెందారా లేక మరెవరైనా కత్తితో దాడి చేసారా అచ్యుతాపురం నాలుగురోడ్ల కూడలికి సమీపంలో యలమంచిలి వెళ్ళే రహదారిలో ఉన్న ఎస్.కె.ఆర్ లాడ్జ్ సోమవారం యువతీ యువకుల మర్డర్ కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే గాజువాక ప్రాంతానికి చెందిన శ్రీనువాస్ అనే యువకుడు, రాంబిల్లి మండలంలో గల ఒక సచివాలయం రైతు భరోసా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న యువతి మహాలక్ష్మి ఇరువురూ రూమ్ నెం.303లో కత్తిపోట్లతో అనుమానాస్పదంగా ఉన్నారు. యువతి మృతి చెందగా, యువకుడు శ్రీనివాస్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అయితే వీరిరువురూ పరస్పరం పొడుచుకున్నారా లేక మరే ఇతర కారణాలతో ఇరువురునీ మరెవరైనా కత్తితో దాడి చేసారా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీఐ మురళీ రావు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము అని తెలిపారు...
Admin
Viswas Tv