విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగిసిన నేపథ్యంలో, విజయనగరం జిల్లా పోలిపల్లిలో టీడీపీ యువగళం నవశకం సభ ఏర్పాటు చేసింది. ఈ విజయోత్సవ సభలో పాల్గొనేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా విచ్చేశారు. ఈ సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పోలిపల్లి వచ్చారు. యువగళం విజయోత్సవ సభా ప్రాంగణం వద్ద పవన్ కల్యాణ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు స్వాగతం పలికారు. పవన్ కల్యాణ్ ను వారు సభా వేదిక వద్దకు తీసుకువచ్చారు. పవన్ రాకతో సభలో ఉన్న జనసేన పార్టీ శ్రేణుల కోలాహలం మిన్నంటింది. ఇక, వేదికపై చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్, బాలకృష్ణ పక్కపక్కనే కూర్చున్నారు. చంద్రబాబుకు మరోవైపున అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, తదితరులు కూర్చున్నారు.
మాడుగుల నియాజక వర్గo నుండి పోలేపల్లి కి, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు ఆధ్వర్యoలో కార్యకర్తలు, అభిమానులు భారీగా తరిలివెళ్లటం, మాజీ ఎమ్మెల్యే వెంటే కార్యకర్తలు ఉండటం, ముగ్గురు టీడీపీ నాయకులు మధ్య నలిగిపోతున్న తరుణంలో, యువగలం ముగిoపు సభ లో ముగ్గురు కలిసి జనసమీకరణoలో, రామానాయుడు వెంటే కార్యకర్తుల, నాయుకులు, మాజీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ లు ఉండటం రామానాయుడు కి కలిసి వచ్చింధీ, అనే చెప్ప వచ్చు.... ఏది ఏమి అయిన మంత్రి బూడికి, డిటి ఆయిన నాయకుడు మాజీ ఎమ్మెల్యే రామానాయుడు పోటీ అని చెప్ప వచ్చు....
Admin
Viswas Tv