విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 22 వరకు చంద్రబాబు రిమాండ్ లో ఉండనున్నారు. చంద్రబాబు తరుపున, సీఐడీ తరుపున వాదనలు విన్న ఏసీబీ కోర్టు.. సిట్ వాదనలతో ఏకభవించి.. చంద్రబాబుకు రిమాండ్ విధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని శనివారం అరెస్ట్ చేసిన అధికారులు రాత్రంతా విచారించిన తర్వాత ఆదివారం ఉదయం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో చంద్రబాబుతో సహా.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరును కూడా చేర్చింది. ఏయితే ఓపెన్ కోర్టులో వాదనలు వినాలని టీడీపీ లీగల్ టీమ్ విజ్ఞప్తి చేయగా.. దీనికి న్యాయముర్తి అంగీకరించారు. చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా బృందం వాదనలు వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఏసీబీ కోర్టులో చంద్రబాబు తన వాదనలు తానే వినిపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. తనను అక్రంగా అరెస్ట్ చేశారని, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
ఉమ్మడి ప.గో జిల్లాలోకి ఎంట్రి అయిన చంద్రబాబు కాన్వాయ్ చంద్రబాబును రాజమండ్రి సెంట్ర్ జైలుకు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోకి చంద్రబాబు కాన్వాయ్ ఎంట్రి అయ్యింది. చంద్రబాబు కాన్వాయ్ని పంపిన తర్వాతే మిగితా వాహనాలను పంపిస్తున్నారు పోలీసులు
భారీ ట్రాఫిక్ జామ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. చంద్రబాబు వెళ్లే రహదారుల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. టీడీపీ కార్యకర్తలు భారీగా వచ్చి చేరుతుండటంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద దాదాపు 40 నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోయాయి
Admin
Viswas Tv