Tuesday, 14 April 2026 11:23:16 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

ఏ పనులు చేయలేక పోతున్నాము.వైస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనo రామనారాయణ రెడ్డి సంచలన వ్యాక్యలు...

Date : 28 December 2022 05:33 PM Views : 926

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / నెల్లూరు జిల్లా : తమ పార్టీ ప్రభుత్వంపైనే వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాపూరులో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆనం రామనారాయణ రెడ్డి.. ప్రజలకు ఏమీ చెయ్యలేకపోతున్నామంటూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ సమావేశంలో ఆనం మాట్లాడుతూ.. అప్పట్లో టీడీపీని తిట్టిపోశాం.. కనీసం ఎస్‌.ఎస్‌ కెనాల్‌కు శంకుస్థాపన కూడా చెయ్యలేకపోయామంటూ వేదికపైనున్న ఇతర వైసీపీ నేతలనే ఉద్దేశించి మాట్లాడారు. రోడ్లు వెయ్యలేకపోయాం, చివరికి గుంతలూ పూడ్చలేకపోతున్నాం. తాగు నీరు అడిగితే కేంద్రం పేరు చెబుతున్నాం. ఇక మనం ఎందుకని జనం అడిగితే ఏం సమాధానం చెప్పాలి అంటూ ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు. పెన్షన్లకే ఓట్లేస్తామా? పెన్షన్లు గత ప్రభుత్వంలో లేవా? వెయ్యిరూపాయలు ఎక్కువ ఇస్తే ఓట్లు పడతాయా..? అని కూడా పేర్కొన్నారు. పనులు చెయ్యకుండా జనం ఎందుకు నమ్ముతారంటూ ప్రశ్నించారు. ఇల్లు కడతామని లేఅవుట్‌ వేసినా ఇప్పటికీ కట్టలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆనం పలు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తనను కూడా నమ్మే పరిస్థితిలో లేరంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్‌ఎస్‌ కెనాల్‌ గురించి సీఎం జగన్‌కు ఎన్నోసార్లు చెప్పానని.. ఇదే విషయాన్ని అసెంబ్లీలోనూ ప్రస్తావించానని తెలిపారు. ప్రస్తుతం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. మళ్లీ గెలవాలని ఉన్నా, మార్గమేదని ప్రశ్నించిన ఆనం.. జనానికి నమ్మకం పోతే ఓట్లు వేస్తారా అంటూ వ్యాఖ్యానించారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :