Saturday, 13 June 2026 04:06:49 PM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

టీడీపీ అధినేత Chandrababu - రోజంతా టీడీపీ నేతల బుజ్జగింపులతో చంద్రబాబు బిజీబిజీ

విశాఖ సౌత్ గండి బాబ్జికె, మాడుగుల రామనాయుడుకె, గంట శ్రీనివాస్, బీమిలికి అవకాసo

Date : 25 February 2024 09:30 PM Views : 1567

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : Chandrababu - TDP: రోజంతా టీడీపీ నేతల బుజ్జగింపులతో చంద్రబాబు బిజీబిజి టీడీపీ-జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా వెలువడ్డాక.. టికెట్ ఆశించి భంగపాటుకు గురైన తెలుగుదేశం పార్టీ నేతలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుజ్జగించారు. ఈ మేరకు చంద్రబాబు రోజంతా (ఆదివారం) బిజీబిజీగా గడిపారు. నేతలతో వ్యక్తిగతంగా మాట్లాడి సర్దిచెప్పారు. ఈ సందర్భంగా కొంతమంది నేతలకు చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. మరికొందరికి హామీలు ఇచ్చారు.

అమరావతి: టీడీపీ-జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా వెలువడ్డాక.. టికెట్ ఆశించి భంగపాటుకు గురైన తెలుగుదేశం పార్టీ నేతలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుజ్జగించారు. ఈ మేరకు చంద్రబాబు రోజంతా (ఆదివారం) బిజీబిజీగా గడిపారు. నేతలతో వ్యక్తిగతంగా మాట్లాడి సర్దిచెప్పారు. ఈ సందర్భంగా కొంతమంది నేతలకు చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. మరికొందరికి హామీలు ఇచ్చారు. చంద్రబాబుని కలిసినవారిలో ఆలపాటి రాజా, పీలా గోవింద్, దేవినేని ఉమ, బొడ్డు వెంకట రమణ చౌదరి, గంటా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, అయ్యన్న, ముక్కా రూపానంద రెడ్డి ఉన్నారు. గంటాకు చీపురుపల్లి నుంచే పోటీ చేయాల్సి ఉంటుందని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. విశాఖ సౌత్ నుంచి గండి బాబ్జీకి దాదాపు లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక చంద్రబాబు నిర్ణయమే తనకు శిరోధార్యమంటూ నమస్కారం చేస్తూ దేవినేని ఉమమహేశ్వర రావు వెళ్లారు. ఇక చంద్రబాబుతో భేటీ అనంతరం ఆలపాటి రాజా, బొడ్డు వెంకట రమణ చౌదరి ఆసంతృప్తితో తిరిగి వెళ్లారు. ఆలపాటి రాజాకు సముచిత న్యాయం జరుగుతుందని చంద్రబాబు హామీ ఇచ్చారని సమాచారం. రాజమండ్రి ఎంపీ సీటును బీజేపీ అడగకుంటే ఆ స్థానం నుంచి బొడ్డు పేరును పరిశీలిస్తామని చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది. ఇక టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు.. పీలా గోవిందును వెంటబెట్టుకొని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అయితే చంద్రబాబుతో భేటీ తర్వాత కూడా పీలా గోవింద్ అసంతృప్తిగానే కనిపించారు. ఇక తనకు రాజంపేట టిక్కెట్ ఇవ్వాలని ముక్కా రూపానంద రెడ్డి టీడీపీ అధినేతను కోరినట్టు తెలుస్తోంది.అలాగే మాడుగుల నియాజకవర్గం సర్వ్ ఆధారంగా మాజీ ఎమ్మెల్యే రామనాయడు అవకాసం కనబడుతుంది అని చంద్రబాబు నుండి అయ్యన్నపాత్రడుకి అదే విషయం చెప్పినట్టు తెలుసుతుంది

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :